సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

26, ఆగస్టు 2014, మంగళవారం

తిక్క తలకెక్కింది

శిరిడి సాయి బాబా దేవుడు కాదు “ -  ధర్మ సంసద్ తీర్మానం .
    -- ఇదీ ఈరోజు వార్త .
శిరిడి సాయి బాబా దేవుడు కాదనీ , గురువూ కాదనీ , అసలు
సన్యాసీ కాదనీ , ఆయన్ని దేవుడుగా ఆరాధించ వద్దనీ  హిందువులకు
సదరు తీర్మానం ఆదేశిస్తూ ఉంది .
బాబా దేవుడా , కాదా , అనే విషయం బాబా భక్తులు చూచు కుంటారు .
ఈ దేశంలో ఇంకేమీ సమస్యలు లేవా , సదరు సంసద్ లు తీర్మానాలు
చేసి పరిష్కరించడానికి ? అని సామాన్యులు ఈ నిర్వాకాలను                                           ఈసడించుకుంటున్నారు . స్వామి వివేకానందుల వారిని ఆదర్శంగా
తీసుకుని ఉంటే ,  సామాన్య జనం మధ్యలో కెళ్ళి వాళ్ళ సమస్యలు
పరిష్కరించడానికి పూనుకునే వారు , అంతే కాని , ఇలాంటి
వివాదాలు సృష్టించి , సమాజంలో చిచ్చు పెట్టే వారు కారు అని ఉక్రోషిస్తున్నారు .
జనాభాలో అత్యధిక శాతం ఉన్న దళిత వర్గాలను , వీళ్ళ అనుచిత
ప్రవర్తనల వల్ల ఆర్ష ధర్మానికి దూరం చేసిన ఈ మేధావులు , ఇప్పు
డింకో వివాదానికి తెర తీశారని తిట్టి పోస్తున్నారు .
                        -----
బాబా  జనం మధ్యలో బతికాడు . సామాన్యులతో సహజీవనం చేశాడు .
వాళ్ళ సమస్యలను తమ సమస్యలుగా భావించాడు . భగవంతుణ్ణి
వాళ్ళకు సన్నిహితం చేశాడు . ఎలా జీవించాలో నేర్పించాడు . ఆయనలో
దురహంకారం ఏకోశానా కన్పించదు . దేని పైనా వ్యామోహాలు లేవు .
భగవంతుని లోని ప్రేమ తత్వం మూర్తీభ వించిన మహానుభావుడు .
సామాన్యుల మధ్య సంచరిస్తూ , మార్గ దర్శనం చేసిన సద్గురువు .
కట్టు బట్టలలో గాని , కడుపు నింపుకోవడంలో గాని , నివాసం విషయం
లో గాని కఠినంగా నియమాన్ని పాటించిన సన్యాసి .
                           -----
బాబాను నమ్మి కొలిచే వాళ్ళు ఈ దేశంలో లెక్కకు మిక్కుటం . బాబా గుడి
లేని పల్లె టూళ్ళు ఈ దేశంలో లేవంటే అతిశయోక్తి కాదు . నేడు రాముడంటే
సాయి రాముడే . కృష్ణుడంటే సాయి కృష్ణుడే . అను నిత్యం బాబా ఆలయాలు
భక్తులతో , హారతులతో , భజనలతో దేదీప్యమానంగా వెలుగొందు చున్నవి .
పుట్టిన ప్రతి బిడ్డకూ సాయి నామం  చేర్చకుండా నామ కరణం చేయడం లేదు .
ఒక వ్యాపార సంస్థ పెట్టినా . ఒక అపార్ట్ మెంటు కట్టినా పెట్టేది సాయి పేరే .
సర్వం సాయి మయం   గా  ఎట్ట యెదుట కళ్ళకు కనబడు తున్నప్పుడు
శిరిడి సాయి బాబా దేవుడు కాదని తీర్మానించడం సర్వజనులనూ తిరస్క
రించడమే . జన బాహుళ్యంతో మమేక మైన సాయి నామాన్ని ఆపాలనే విఫల
ప్రయత్నం మద్యందిన మార్తాండునికి చేతు లడ్డు పెట్టడమే .
రాముణ్ణి కొలిచినంత గొప్పగా సాయిరాముణ్ణీ , కృష్ణున్ని తలచినంత మిక్కుటముగా      
 సాయి కృష్ణుణ్ణీ  నేడు కొలుస్తున్నారు , తలుస్తున్నారు .   
దైవాన్ని అనేక రూపాలలో దర్శించడం , పూజించడం హిందువులకున్న గొప్ప గుణం . 
  దీన్ని కాదని ,   పెద్దలు భక్తి విషయాన్ని
వివాదం చేయడం మాని , జన సామాన్యానికి దగ్గరై  , వాళ్ళ దైనందిన సమస్యలలో
పాలు పంచుకుని , పరిష్కారాలను అన్వేషిస్తారని ఆశిద్దాం .














2 కామెంట్‌లు: