సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, జులై 2015, శుక్రవారం

ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై .

శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
             హితబోధ చేసిన హితు డతండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి
            తాననుభవించిన త్యాగ శీలి
' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ
            మాదుకొను కరుణామయు డతండు

సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు – శరణంచు శరణు వేడి
చరణములు తాకి తరియింత్రు జనులు – శరణు
శరణు గురు పౌర్ణమీ శుభంకర దినమున .

          ప్రపంచానికి మార్గ దర్శనం చేసిన మహాను భావులందరూ గురువులే .
ఈ గురు పరంపరలో వ్యాస భగవానుని పేర గురు పౌర్ణమి జరుపుకోవడం
ఆనవాయితీ . ఈ గురు పౌర్ణమి పర్వ దినాన్ని తాను జీవించినంత కాలమూ
శ్రీ శిరిడి సాయి బాబా వేడుకగా జరిపించేవారు . ఆయన సమాధి చేరిన తదుపరి
శ్రీ సాయి నాధుని మందిరాలలో గురుపౌర్ణమి వేడుకల సంబరాలు ఘనంగా
జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది .  

ప్రతి యొక్కరు సాయి తనకు
హితుడని భావించు సాన్ని హిత్యము చూడన్
అతడు మన గుండె నిండా
సతతము కొలువుండు టెల్ల సత్యమె యందున్ .

గురు పూర్ణిమ శుభ దినమున

గురురాట్ శ్రీ సాయి నాధు గొలిచిన జగతిన్

గురుతెరిగి సాయి నాథుడు

తిరముగ దు:ఖములు బాపి తీరము జేర్చున్ .


                                                                    ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ  జై .    

3 కామెంట్‌లు:

  1. ........ వ్యాస భగవానుని పేర గురు పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీ . ఈ గురు పౌర్ణమి పర్వ దినాన్ని తాను జీవించినంత కాలమూ శ్రీ శిరిడి సాయి బాబా వేడుకగా జరిపించేవారు . ఆయన సమాధి చేరిన తదుపరి ......

    ...... సాయిభక్తులు వ్యాసుణ్ణి మరచారు. సాయి మహరాజ్ గారిని గురించి భజనలూ పూజలూ చేస్తూ పోయే వీళ్ళలో చాలా మందికి వేదవ్యాసుడెవరో కూడా తెలియదేమో!

    ఈ రోజు భగవన్ వేదవ్యాసులవారి జయంతి అన్నది క్రొత్తదేవుళ్ళ భక్తిలో మునకలు వేస్తున్న మనవాళ్ళు దాదాపుగా మరచిపోయారేమో!

    రిప్లయితొలగించండి
  2. ఒకపాతటపా: వ్యాస పూర్ణిమ - గురుపూర్ణిమ ( http://smarana-bharathi.blogspot.in/2012/06/blog-post_2883.html )

    రిప్లయితొలగించండి
  3. ...... సాయిభక్తులు వ్యాసుణ్ణి మరచారు. సాయి మహరాజ్ గారిని గురించి భజనలూ పూజలూ చేస్తూ పోయే వీళ్ళలో చాలా మందికి వేదవ్యాసుడెవరో కూడా తెలియదేమో!
    ........ ఈ మాటల వల్ల అర్థమౌతున్నదేమితంటే , మన పండితులు జన సామాన్యాన్ని ఎంత గొప్పగా దూరం పెట్టేశారా అని ,
    ధన్యవాదములు సర్ ,

    రిప్లయితొలగించండి