సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, అక్టోబర్ 2015, శనివారం

మృతులు జీవింతు రీ భూమి మీద మరల




గిరి , తరు , ఝరీ పరీత ప్రకృతిమయ మయి ,
కడు మనోఙ్ఞమై , సూర్య సంకాశ మైన       
పుడమి యందాలు వీక్షించు పుణ్య మరసి
మనకు కన్నుల నొసగెను మాధవుండు
 
సకల జగతిని వీక్షించు శక్తి గలిగి
చూచి గుర్తించు ఙ్ఞాన విస్ఫూర్తి గలిగి
తనర ప్రాణుల కానంద దాయకమయి
గ్రాలు సర్వేంద్రియ ప్రధానాలు – “ కళ్ళు

పుట్టు గ్రుడ్డులే గాక , యీ పుడమి మీద
పలు ప్రమాదాలు , రోగాల బడుట వలన
కళ్లు  గోల్పోయి అంధులై గనలు వారు
కటిక చీకటిన్ బ్రతుకుట గాంచి కూడ ....
 
మార్గ ముండియు  చైతన్య మబ్బకునికి
మరణ శయ్యకు జేరిన మనుజ వరుల
కళ్ళు మరణించు చున్నవి గాని ,   పూని
నేత్ర దానమ్ము జేసిన     నిలుచును గద !
 
మనిషి మరణించినను ,   కళ్ళు బ్రతికి ,     మరొక
మనుజునకు   చూపొసగి ,    అట్టి మనిషి వలన
మరల లోకాన్ని గనును ,  “ సమ్మతి యొసంగ ,
మానవత్వము వెల్లువై మహి వెలుగును .
 
ముందు చూపున్న మనుజులు పుణ్య ఫలము
నమ్మి ,  నేత్ర దానమ్మియ్య సమ్మతించి  ,
అంధులకు చూపు నొసగుదు  రమరు లయ్యు ,
మృతులు జీవింతు రీ భూమి మీద మరల .

 

 

 

 

 

1 కామెంట్‌:

  1. మాస్టారుగార్కి,
    నమస్కారములు.

    ఈ మధ్య స్మరణ లో చక్రాలు గురించి టపాలు పెట్టాను. అందులో అనాహతచక్రం గురించి ఓ సందేహం వచ్చి, సరైనది నిర్ధారించుకోలేక ఆవేదనకు లోనౌతున్నాను. నా సందేహమును వివరంగా ఈ రోజు టపాలో పెట్టాను. తప్పుగా భావించక, ఆ టపాను చూసి, దయచేసి ఆ నా సందేహమును తీర్చి, నా ఆవేదనను తగ్గించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

    రిప్లయితొలగించండి