సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, సెప్టెంబర్ 2015, బుధవారం

దైవం లేని దెక్కడ ?


 
మానవ జీవనావసరాలలో జ్ఞానానికి తొలి ప్రాధాన్యతనిచ్చి జ్ఞానాన్ని దైవంగా భావించడం జరిగింది .

అందుకు ప్రతీకగా సరస్వతీ _ బ్రహ్మల మూర్తులను రూపొందించుకొని అర్చించినారు .

పాడి పంటలు  మొదలైన సర్వ సంపదలనూ ఆరాధనా భావంతో కొలిచి అందుకు ప్రతీకగా  లక్ష్మీ _ విష్ణు

మూర్తులను రూపొందించుకొని అర్చిస్తున్నారు . సృష్టికి మూలమైన స్త్రీ పురుష తత్త్వపు పవిత్రతకు

ప్రతీకగా లింగ రూపంలో పార్వతీ పరమేశ్వర మూర్తులను రూపొందించుకొని అభిషేకిస్తున్నారు .  

మానవ మనుగడకు ఆధారభూతాలైన భూమినీ , నీటినీ , నిప్పునూ , గాలినీ గౌరవించి

వాటికి ప్రతీకలుగా దేవతా మూర్తులను రూపొందించి కొలుస్తున్నారు .

తలపెట్టిన కార్యంలో విజయం సిధ్ధించాలంటే అవసరమైనది బుధ్ధి కుశలత . బుధ్ధి కుశలత

ద్వారా విజయం సిధ్ధించడమనే భావనకు ప్రతీకగా గణేష్ మూర్తిని రూపొందించి ప్రార్థిస్తున్నారు .

నదులను పుణ్యతీర్థాలుగా , పర్వతాలను పుణ్యక్షేత్రాలుగా , అడవులను వనదేవతలుగా ,

ప్రకృతిని ప్రకృతి మాతగా  _  ఇలా విశ్లేషిస్తూ పోతే  ,  భారతీయ తాత్వికతలో చెట్టూ , పుట్టా ,

జంతువూ , పక్షీ   _  ప్రతిదీ మానవ మనుగడకు అవసరమై  తద్వారా  పూజార్హమై కొలవ బడుతున్నవి .

ఇలా , మానవ మనుగడకు దోహదపడే అన్నింటినీ  _  అది భావన కావచ్చు , ప్రకృతిలోని పదార్థం

కావచ్చు . మరి , భారతీయ తాత్వికతలో దైవం లేని దెక్కడ  ?    

 

         ఐతే _ జ్ఞానం , సంపద , కార్య సిధ్ధి  మొదలైన మానవావసరాలను సాధించడానికి ఏతత్సం

బంధమైన అవగాహన , పట్టుదల , కృషి  మాత్రమే ఉపయోగపడుతాయని గుర్తుంచుకోవాలి . కృషిని వదిలి , దైవాన్ని అడ్డంపెట్టుకొని చేసే మోసగాళ్ళ మాయ మాటల వల్ల , మోసాల క్రతువుల వల్ల ఎలాంటి ప్రయోజనం సిధ్ధించదు .

మౌఢ్యాన్ని వీడిన  చైతన్యవంతులు దైవాన్ని ఎల్లెడలా వీక్షించి సత్య , జ్ఞాన , ఆనంద పరవశులౌతారు .  

 

           ఇక , యుగ యుగాల మానవ చరిత్రలో ఎందరో మహనీయులు పుట్టి , తమ తమ కాలాల

లోని మానవ సమాజాలను చైతన్య పరచి , అండగా నిలిచి ఆరాధ్యులైనారు . కృతజ్ఞతగా ఆయా

మహాను భావుల మూర్తులకు గుళ్లు గోపురాలు కట్టి , పూజించడం , వారి జయంతులను

పర్వదినాలుగా నిర్వహించడం భారతీయ తత్వంలోని గొప్పదనం .

ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తే , శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుధ్ధుడు , సాయి మహరాజ్  , క్రీస్తు , మహమ్మదు _

ఇంకా అనేక మంది మహనీయులు వందనీయులు .

             ఇంకా , ప్రాంతాల వారీగా ప్రసిధ్ధులైన మహనీయులెంతో మంది జనాల నీరాజనాలందుకుం

టున్నారు . మరి , భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ ?  దైవం లేనిదెక్కడ ?  మలిన మస్తిష్కాలలో తప్ప .