సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, మే 2017, బుధవారం

మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం


మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం
------------------------------------------
మా కుల్లూరు గ్రామం చెరువు కట్ట క్రింద ,
అలుగుకూ - కోట శిథిలాలకూ మథ్య
ప్రాచీన శివాలయం శిథిలావస్థలో ఉండేది .
మా బాల్యంలో సదరు శిథిలాలలో ఆడుకునే
వాళ్ళం . శివాలయానికి ఉపయోగించిన గోధుమ
వర్ణపు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఊడి చెల్లా
చెదురుగా పడి ఉండేవి . నల్లరాతితో చెక్కబడి
నిగనిగలాడుతూ పెద్ద నంది విగ్రహం కూడా
ఉండేది . దానిని ముక్కలు చేసి దొంగలు
తరలించారని వినికిడి .
         మా కుల్లూరు గ్రామస్థుడు , ప్రస్తుతం బెంగ
ళూరు నివాసి , పరమ ధార్మికుడు శ్రీ యాదాల
కృష్ణయ్య గారు పూనుకొని సదరు శివాలయాన్ని
సర్వాంగ సుందరంగా పునర్నిర్మిస్తున్నారు . తెల్లటి
గ్రానైట్ రాళ్ళు తెప్పించి , ఆలయ నిర్మాణం చేపట్టి
నారు . ఆలయానికి ముందు రాతి స్తంభాలతో సు
విశాలమైన మండప నిర్మాణం చేశారు . పూర్వం
వందల యేళ్ళనాటి మహారాజుల నిర్మాణ శైలిని
బోలి ఆలయం కను విందు చేస్తూ ఉంది .
            మూడెకరాల సువిశాల ఆలయ ప్రాంగణ
మంతా వివిథ పూల మొక్కలతో , వృక్షాలతో
ఆలయం నయన మనోహరంగా రూపు దిద్దుకుం
టోంది . ఈ శివాలయం పేరు గంగాధరేశ్వరాల
యం . కృష్ణయ్య గారి జీవితం ధన్యం .
            జీర్ణోధ్ధరణ సమయంలో ఈప్రదేశంలో
ఒక శిలాశాసనం బయల్పడి ఆలయంలో ప్రతి
ష్టింప బడింది . దీనిపైన శాసనం తమిళ లిపిలో
చెక్కబడి ఉంది . దీనిని తెలుగులోకి తర్జుమా
చేస్తే ఆలయానికి , గ్రామానికీ సంబంధించిన
సమాచారం తెలియగలదు . పాఠకులు ప్రయ
త్నించ గలరు .
 శాసనం
-----------

మా కుల్లూరు -- శాసనాధారాలు

మా కుల్లూరు - శాసనాధారాలు
-------------------------------------
ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ
ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది .
ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ
బడి ఉంది . 1574 అనుకుంటాను .
ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ
బడినది .
సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , అతడు ముప్పది మూడు శిలాస్థంభములతో అలుగు నిర్మించడం ఈ శిలాశాసనంలోని అంశం .
ప్రసక్తాను ప్రసక్తంగా సదరు రుద్రప్ప అనంతసాగరం
చెరువు తూమును , కలువాయి చెరువు తూర్పు
అలుగును అంతకు ముందే నిర్మించి యున్నట్లు
ఈ శాసనంలో ఉట్టంకించ బడింది .
ఈ శాసనస్థ తెలుగు భాష కొద్దిపాటి తేడాలతో
ఇప్పటి తెలుగు భాషకు , లిపికి దగ్గరగా ఉంది .
ఇందులో చివర్న రుద్రప్పను పొగుడుతూ
ఒక సీస పద్యం కూడా ఉన్నట్లు నాకనిపించింది .
అక్షరాలు మసక బారడం వల్ల చాలవరకు స్పష్టత
కోల్పోయినవి . తేటగీతి పద్యం మాత్రం కాస్త
విస్పష్టంగా ఉంది .
తేటగీతి పద్యం
------------------
నిలిపె కుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా... లుంజెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్ర శౌరి .

శాసనం
---------