సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, మార్చి 2017, శుక్రవారం

పద్యం - పరమార్థం

                           పద్యం - పరమార్థం
                            *************        
                 
వచనం గుర్తుంచుకోవడానికి వీలవదు . మనస్సు
నాకట్టు కుంటే పద్యం హత్తుకు పోతుంది .పలు
సందర్భాలలో ఉదహరించ బడుతుంది .
వచనంలో లేని ' నడక - లయ ' పద్యాన్ని గుర్తుం
డేలా చేస్తుంది . వచనంలో లేని ' స్వారస్యం ' పద్యంలో చూపించ వచ్చు . శబ్ద అనువృత్తులు
శోభను కూర్చి పద్యాన్ని మనోఙ్ఞం చేస్తాయి .
తెలుగు వాళ్ళు ఇప్పటికీ సుమతి , వేమన శతకాలనూ , భాగవత పద్యాలనూ నెమరు వేసుకుంటుంటారంటే పద్యం సరళంగానూ ,
చదువగానే అర్థమయ్యేలా ఉండబట్టే జనం
లోకి అమితంగా చొచ్చుకు పోయినవి .
' మేం పండితులం , మామూలు జనం కంటే
మాకు రెండేసి తలలున్నాయి ' అనుకోబట్టే
పద్యానికి జనం దూరమయ్యారు .
పద్యాన్ని సరళం చేసి , చదవంగానే అర్థమయ్యే
భాషలో రాస్తే , జనానికి చేరువౌతుంది . ఔత్సాహి
కులు రాయడానికి కూడా ముందుకు వస్తారు .
తెలుగు పద్యం కలకాలం వర్థిల్లుతుంది .
పద్యం రాయడానికి ఎవడైనా ముందుకొస్తే
ఈపదం గ్రామ్యం , ఈపదం వ్యాకరణ విరుధ్ధం ,
అని బెదరగొట్టేస్తున్నారు . అమ్మో , ఇది మనకు అచ్చుబాటయ్యే విషయం కాదు ,ఇదిపండితులకు
సంబంధించింది . - అని ఔత్సాహికులు మథ్యలోనే వదిలేస్తున్నారు .
సోషల్ మీడియా వల్ల జనంలో చాలమంది రచనల పట్ల , ముఖ్యంగా పద్యం పట్ల ఆకర్షితులౌతున్నారు . వారికి సహకరించాలి గాని , తమ శషభిషలతో అవమాన పరచడం పండితులకు భావ్యం కాదు .
వాడుకభాష పారుటేరు . మార్పు జీవద్భాషకు సహజం . మారిన మార్పును నమోదు చేసేందుకే వ్యాకరణం . పిడికెడు మంది పండితులు తలలూచడమే భాషకు ప్రయోజనం కారాదు . జన బాహుళ్యం లోకి చొచ్చుకు పోతేనే ఏదైనా బ్రతికుండేది .
పూర్వకవుల వాడుక భాష కూడా గ్రాంథికమే . మనం గ్రాంధికం మాట్లాడడం లేదే .
శిష్ట వ్యావహారికం కూడా పద్యంలో పనికి రాదా ?
అసలు తమరు రాసే పద్యాలు చదువరులకు
అర్థం కాక పోతే రాసేదెందుకు . మరీ విచిత్రంగా
కొందరు తాము రాసిన పద్యంలోని పదాలకు టీకా , టిప్పణి రాసుకుంటున్నారు .
చేయుచూ , చేస్తూ అని రాయకూడదట . అది వ్యావహారికం , చేయుచున్ అని గ్రాంధికం రాయండని ఆదేశిస్తున్నారు .
కాస్తయినా అనకూడదట , కొంతయినా అనాలట .
వల్ల అనకూడదు వలన అనాలి . ఇలా శిష్ట వ్యవహారాలుకూడా
పద్యంలో కూడదట . అడిగితే , మావి
సాంప్రదాయిక తులసివనాలంటారు .
నా భాదల్లా, సోషల్ సోషల్ మీడియాల పుణ్యం
వల్ల పద్యం రాయడం నేర్చుకోవడానికి చాలమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు . వారికి
సహకరించండి . పద్యాన్ని కనీసం కొన్ని తరాల
వరకైనా మననీయండి .
ఇక , నావిషయం -
తమరనుకుంటూండవచ్చు . ' వీడికేం తెలుసు ఛందస్సు , వ్యాకరణం - వాటి గొప్పతనం , వీడు
కూడా భాషను గూర్చి మాటాడే వాడా ' - అని .
నేను విద్వాన్ , పండిత శిక్షణ , MA , B ed , ఇంకా
అనేకం చదువుకున్న వాణ్ణి . ఛందో వ్యాకరణ భాషాశాస్త్రాలు పఠించిన భాషా , సారస్వతాభి
మానిని . 38 దేండ్లు ఉపాధ్యాయ వృత్తి నెరపిన
వాణ్ణి . కానీ , పండితాహంకారం కానీ భేషజం కానీ
దరిజేరనీయను . వినయం అలంకారం గా బ్రతికిన
వాణ్ణి .
భాష పుట్టింది జనబాహుళ్యం నాలుకల మీద .
పండితుల మెదళ్ళ నుండి కాదు .
పద్యాన్ని పలువురు చదివేలా , రాయడం నేర్చు
కునేలా ప్రయత్నిద్దాం .


8, మార్చి 2017, బుధవారం

తల్లీ ! వందనము .....

ఇల్లు పిల్లల బాధ్యతల్ యెల్ల వేళ ,
ఇప్పుడో , వీటితో పాటు యింతులు మరి
పట్టి రుద్యోగ భాద్యతల్ , భారతీయ
మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .

మగనికిని పిల్ల లత్త మామలకు జేసి
 మరల నుద్యోగ భాద్యతల్ , మగుడ ' నిల్లు-
పిల్ల '  లిదె ' తనలోక ' , మీతల్లి పనులు
వేకువన లేవ నేరాత్రి వేళొ తీరు .

ప్రొద్దెక్కి నిద్ర లేచును
తద్దయు లేటైనదంచు తద్ధిమి తకతోం
ఒద్దిక లేదేనాడును
బుద్ధి యెపుడు గలుగు నిట్టి పురుషుడికమ్మా !

ఆఫీసు నుండి యింటికి
సాఫీగా రాడు సారు , చాల పనులహో !
తాపీగా పదకుండుకు
పాపలు నిదురోయినాక , పరుగున వచ్చున్ .

ఇట్టి మగవాళ్ళ నదుపులో బెట్ట , దిన ది
నమ్ము పోరాడి సంసార నౌక నొడ్డు
జేర్చు నోరిమికి సలాము జేతు మమ్మ !
తల్లి ! మాకు ' నీవే ' కల్ప వల్లి వమ్మ !