సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, మే 2012, మంగళవారం

విద్యాసదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత .....

                విద్యా సదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత గణనీయమైన ప్రాధాన్యత సంత రించు కొని ఉంది . జాతీయాదాయం లో అధిక శాతం విద్యా సదుపాయాల కోసంఖర్చు చేసే ప్రభుత్వాలు విజ్ఞ త గల ప్రభుత్వాలు .
                విద్యా వనరులు ఎక్కువగా ఉన్న దేశాల లోని ప్రజలు ఎక్కువ శాతం
విద్యా వంతులౌ తారు . విద్యా వంతులున్న సమాజం లోని ప్రజలు తమ సమస్య లకు
తామే చక్కని పరిష్కారాలు చూసుకో గల్గుతారు . అలాంటి దేశాలు అభి వృధ్ధి
పధంలో దూసుకు పోతాయి . ఆ దేశాల లోని ప్రభుత్వాలకు అవినీతి , ఆశ్రిత పక్ష
పాతం , లంచగొండితనాల మీద పోరాడ వలసిన అవసరం ఉండదు . అక్కడ ఉగ్రవాదం ,
వేర్పాటువాదం , హత్యలు , దోపిడీలు, అంటురోగాల వ్యాప్తి – అనే సమస్య
లుండవు . ప్రభుత్వాలు సజావుగా నడుస్తాయి . వ్యవసాయ , పారిశ్రామిక
ఉత్పత్తులు పెరుగు తాయి. జాతీయాదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తుంది .
ఇదంతా విద్యవల్ల ఏర్పడే బహుళ ప్రయోజనం .
               మరి ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు గుర్తిస్తున్నాయి ?
. " విద్యాశాఖ పద్దు క్రింద ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం . ఖర్చు తప్ప
ఈశాఖ లో ఆదాయం కంపించడం లేదు " – అని గతంలో ఒక మంత్రి మహోదయులు
సెలవిచ్చారంటే మన ప్రభుత్వాలను నడిపే ప్రబుధ్ధులు ఎంతటి విద్యాసక్తి
గలవారో , వారిలోగల ప్రజాసేవాభావం ఏపాటిదో , ఎంత తల్లకిందులుగా
కార్యమగ్నమై ఉందో కీర్తించ వలసిందే .
               దేశ ప్రజలంతా విద్యా వంతులైతే డబ్బు తీసుకొని ఓటెయ్యరు
కదా ! సారా పొట్లాలనూ , బిర్యానీ పొట్లాలనూ దరి దాపుల్లోకి రానియ్యరు కదా !
. విద్యా వంతు లైన ప్రజల పై ప్రలోభాలు పనిచెయ్యవు . వారికేమి కావాలో చేయ
గల్గినప్రభుత్వాలనే నిక్కచ్చిగా ఎన్నుకొంటారు . రౌడీ రాజ కీయాలకూ , గూండా
ప్రభుత్వాలకూ చెల్లు చీటీ పడుతుంది మరి .
              నూటికినూరుశాతం విద్యా వంత మైన సమాజం ఏర్పడడానికి ప్రభుత్వ పరంగా
ఏమేమి చేయాలి ?
              కనీసం ఇంటర్ మీడియట్ స్థాయి వరకు ఒకే ఒక ప్రభుత్వ సెక్టార్ లోనే
విద్యాలయాలు నిర్వహింప బడాలి . విద్యాలయాలు రెసిడెన్షియల్ విధానంలో సకల
సదుపాయాలు కల్గిన " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులు " గా తీర్చి దిద్ద బడాలి .
              అంటే పిల్లవాడు నర్సరీ లో " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులో
"అడుగుపెడితే ఇక ఇంటితో , తల్లి దండ్రు ల తో సంబంధం లేకుండా – అక్కడే
పెరిగి పెద్దవాడై విద్యాబుధ్ధులతో ఇంటర్ పూర్తిచేసుకొని మంచి మూర్తిమత్వం
రూపుదిద్దుకొనిప్రయోజకుడైబయటిప్రపంచములోకిరావాలి.                                                                                                                                                                  దీనికోసం తల్లిదండ్రులనుండి ఒక్కరూపాయి కూడా వసూలుచేయరాదు . పేద ధనిక తేడాలుందరాదు .
               పెద్ద పంచాయితీ లైతే ఒకటి , చిన్న పంచాయితీలు రెండు మూడింటికి కలిపి
ఒకటి చొప్పున – జనాభా ప్రాతి పదికన – ఏర్పాటుచేయ వచ్చు .                                                 ఖర్చువిషయానికి వస్తే విద్యా శాఖలో ఒక్కో ఊళ్లో – మెయిన్ స్కూలు, హెచ్ సి, జి
సి, నాన్ ఫార్మల్, హైస్కూలు, ఆర్ బీ సీ, ఎయిడెడ్, ఇంకా ఇంకా అనేకానేక
దండుగ మారి దుకాణాలన్నీమూసేసి ఆనిధులను విని యోగించవచ్చు .
              సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ మొదలైన అవినీతిమయ హాస్టల్ల అవసరం ఉండదు .
ఇప్పుడు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాలయాల అవసరంలేదు ,
              విద్యా శాఖ నంతా ఒక కొలిక్కితెచ్చి ప్రభుత్వాలు పిల్లల నందర్నీ దత్తత
తీసుకొని ఇంటర్ వరకూ చదివించే బాధ్యత తీసుకొంటే – అటు తర్వాత ఏర్పడ బోయే
సమాజాన్ని ఊహించుకొంటే ఎంత ఆనందం కల్గుతుందో గదా !

14, మే 2012, సోమవారం

తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు !

నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్
*****
తెలుగు పద్యమెంత టేస్టు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలియ కంటె ,
మల్లె విరుల కంటె , మనసైన పని కంటె
భాగ్య నగరి లోని బ్రతుకు కంటె
*****
పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కవితలో
*****
తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల
*****
తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !