భారతాంధ్రీకరణ మహాభాగుడును , హ
రిహరనాధదేవుని రూపురేఖలు రచించి ,
శైవ వైష్ణవుల కొఱకు , సామరస్య
తెఱగు జూపిన సంస్కర్త , తిక్కయజ్వ .
భారతాంధ్రీకరణ మహాభాగుడును , హ
రిహరనాధదేవుని రూపురేఖలు రచించి ,
శైవ వైష్ణవుల కొఱకు , సామరస్య
తెఱగు జూపిన సంస్కర్త , తిక్కయజ్వ .
రామా ! రఘువీర ! పరం
ధామా ! నీ డెంద మెంత దావానలమై
భూమిసుత కోస మేడ్చెనొ !
స్వామీ ! నిన్ జూడ , కండ్లు భాష్పము రాల్చెన్ .
విలపించు జగన్నాధుని
అలసట బాపంగ శాఖ లల్లనవీచెన్
అలరుల పరిమళ మద్దుచు
మలయపవన సేవజేసి మ్రాను తరించెన్ .
శ్రీరామ పరిష్వంగం
బారయ సీతమ్మకున్ను పవనసుతునికిన్
నేరుగ లభించె , చెట్టిది
కోరినదో లేదొగాని గొప్పగ దొరికెన్ .
మాధవుని పాదదర్శన
సాధన భాగ్యంబుగోరు సకలర్షులకున్
శోధనకందని కౌగిలి
శ్రీధవు డీ తరువు కొసగె శ్రీభాగ్యంబుల్ .
అమ్మా యని నోరారా
ఇమ్ముగ భజియించిన , మన ఈప్సితముల నా
యమ్మ యొసంగును , మనపయి
అమ్మకు వాత్సల్యమధిక , మమ్మకు ప్రణతుల్ 🙏 .
చెన్నుందామెరలోని స్వఛ్ఛతలు ఈస్త్రీయందు గన్పట్టు , సం
పన్నుల్ బంగరు భూషణాలు ధరియింపన్ రాని విణ్ణానపున్
వన్నెల్ , ఆ ప్రకృతీ సమీపగత జీవావాసులందుండుటల్
ఎన్నంగానగు , నీమెకున్ గొలనుకు న్నేవో దోచు సాపత్యముల్ .
ఈ మహానటి సాటి రా నెవరు గలరు
హేమ మకుటమ్మ దొడిగె కళామతల్లి
తెలుగుల సినీజగత్తు వో వెలుగు వెలిగె
అరయ సావిత్రివల్లనే ననగ జెల్లు .
బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా
మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.
సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు. అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.
*అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).*
*ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు - ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).*
*చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.*
*అందుకే:*
*మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.*
*ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.*
*ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ* *కాపలాదారుగా మారిపోయి*
*వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ, కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.*
*ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.*
*"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".*
*మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.*
ఘనముగ భూమికి బుట్టెను ,
జనకుని గారాలపట్టి స్థానము గనియెన్ ,
యినకుల తిలకుని బొందెను ,
జనజగతికి తల్లియయ్యె , జననికి ప్రణతుల్ 🙏 .
ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?
వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.
ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.
.
“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
.
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”
.
పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.
తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,
నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.
ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,
ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి.
అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.
పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.
చూపు దిప్పుకోనగున ఈశోభనంపు
మాధురీ మనోఙ్ఞతలకు , మదను డలిగి
పుడమి సరసుల డెందాల కడిది జీల్చ
వింటి కెక్కుబెట్టిన వాడి విశిఖ మేమొ !