అశ్రు నివాళి
--------------
మమతాను రాగాలు మనిషియై జన్మించి
ధన్యత గాంచిన తన్వి తాను
బంధు జనుల పట్ల బహు ప్రీతి జూపించి
తల లోన నాల్కయౌ తన్వి తాను
పేద సాదల కింత పెట్టు ధర్మ నిరతి
తనరారు చేతల తన్వి తాను
భర్తయు , బిడ్డల పటు ప్రేమ లను బొంది
తనిసి జీవించిన తన్వి తాను
ఇన్ని యిచ్చియు నారోగ్య మీని యీశ్వ
రుని చెయిదమును ప్రశ్నించ పనిగొని తను
నా సుభాషిణి దివికేగె -- నశ్రు జలము
లారవు నయనాల -- నివాళు లందు కొనుము .