24, ఏప్రిల్ 2026, శుక్రవారం

నిన్న తిరుమలేశుని దర్శించితిని

 

చూచితి కన్నులార , నిజ శోభల నీ గురువారమందు , ల
క్ష్మీ చెలువుండు తా నటుల శ్రీ నిలయంబున స్వస్వరూపుడై
రోచిషులూర నిల్చొనుట,లోతనువంతయు పుల్కరించె , నే
మాచెలువమ్ము,భూషణవినాశుభమంగళమోహనాంగముల్ 

నిన్న తిరుమలకు వెళ్ళితి ,
నెన్నడు నిజ రూప దర్శనీయత గన లే ,
కన్నుల భాగ్యము పండెను
పన్నుగ శ్రీవారి గంటి , పరవశ నైతిన్ .

దివ్య మంగళ మూర్తిని తేరి పార
జూచితిని , తన్మయత్వము చూరగొనగ
శ్రీనివాసుని గంటిని , సిరులు పొంగు
తిరుమల మనోఙ్ఞతల్ జూచితిని ఘనముగ .

ఆనంద నిలయ వాసుని
శ్రీ నివసిత వక్ష శుభగ జిత మన్మధునిన్
భాను నిభు , తిరుమలేశుని
మానితగుణు తిరిగి తిరిగి , మరి మరి గంటిన్

ఆ యానందపు ఘనతలు
శ్రేయంబులు గూర్చు , మనసు ప్రియపడు , తనరున్
కాయము , కోర్కె నశించును ,
ధీయు , మహోన్నత విభవపు ధిషణలు పెరుగున్ .