సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జూన్ 2020, సోమవారం

మనభాగ్య మెట్లున్నదో ?.....


మనభాగ్య మెట్లున్నదో ?
        ----------------------------
     2020 యేడాది  భౌగోళిక ప్రమాదాల పుట్టగా
గోచరిస్తోంది . చైనాలో మొదలైన కోవిడ్ వైరస్
ప్రపంచాన్ని వణికిస్తోంది . ఇంకెంతకాలం ? అంటే ,
టీకామందు(వ్యాక్సిన్) కనుగొనబడి ,అది సమర్థంగా
పనిచేసేదాకా ఈవైరస్తో సహజీవనం తప్పదు . ఆర్థికంగా చితికిపోవడం , అస్తవ్యస్తం అనుభవించాల్సిందే . మరోదారి లేదు .
           ఇక , రెండో ప్రమాదాన్ని నాసా హెచ్చరించింది . మామూలుగా ఉల్కలూ , గ్రహశకలాలూ అత్యంత వేగంగా భూమికి సమీపం నుండి
దూసుకు వెళ్ళడం కద్దు . కానీ , ఒక భారీ గ్రహశకలం
భూమివైపుగా దూసుకు వస్తోందనీ , అదిగాని ,
భూమి గురుత్వాకర్షణ ప్రభావానికిలోనైతే , భూగోళం
పై వినాశనం తప్పదనీ ఊహిస్తున్నారు .
           మూడవది . కార్తాంతిక మహానుభావుల
ప్రిడిక్షన్ . వీళ్ళవద్ద నాసా సంస్థకున్న సశాస్త్రీయ సాంకేతిక సరంజామా లేకున్నా , పూర్వపు అనుభ
వాలనుబట్టి ముందస్తు తీర్మాణాలు చేస్తుంటారు .
కురుక్షేత్రయుధ్ధానికి పూర్వం - 14రోజుల వ్యవధిలో
చంద్ర , సూర్యగ్రహణాలు సంభవించడం ఉటంకించి ,
దరిమిలా పరిణామాలను ఉదహరించి ,
ఈ నెలలోకూడా 14రోజులవ్యవధిలో చంద్ర సూర్య
గ్రహణాలు ఏర్పడడం , పూర్వపు దుష్పరిణామాలు
పునరావృతమౌతాయనీ ఊదరగొట్టేస్తున్నారు .
జరుగనున్నది జరుగక మానదు కదా !
       ఐనా , మానవుడు మహామేధావి !? . అనేక
విపరిణామాలను తప మేథోబలంతో ఎదిరి పోరాడి
జీవనం కొనసాగస్తున్నాడు . మరి , మాధవు డనుకూ
లిస్తాడో , లేదో? . మనభాగ్య మెట్లున్నదో ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి