20, మార్చి 2020, శుక్రవారం

పాదాబ్జములు బట్టె పడతి యా రుక్మిణి .....


పాదాబ్జములు బట్టె పడతి యా రుక్మిణి ,

కైసేసె సత్య మంగళ కరముగ ,

చందన మైపూత జమిరె జాంబవతి , నా

గ్నజితియు వెలయించె కౌస్తభమును ,

తగ కిరీటము వెట్టె తరుణి యా లక్షణ ,

ఫలములు తినిపించె భద్ర కొసరి ,

తాంబూల మందించె తమకించి కాళింది ,

మెఱయ ముద్దొకటిచ్చె మిత్రవింద ,


అష్ట సఖులిట్లు పరమాత్మ కిష్టులగుచు

పరగ ననుకూల దాంపత్య పరత దేల్చి

అంద రొకరయి శుధ్ధాంత మందిరమున

నంది , నందించి శ్రీకృష్ణు నొంది రొకట .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి