చిచ్చుబుడ్లకు బదుల్ చచ్చు బుడ్లిచ్చిరి
కాకర పూగుత్తి కాలదయ్యె
విరి మతాబుల బదుల్ సురసురాలిచ్చిరి
డాంటపాసుల వొత్తు లంట వయ్యె
భూచక్రములు కాస్త బూజు పట్ఠె తడిసి
విష్ణు చక్రమ్ములు వెలుగ వయ్యె
తారజువ్వ లరచి తడబడి తడబడి
నింగి కెగుర లేక నీల్గుచుండె
ఆంధ్ర కిచ్చిరి ' టపాసులు ' కేంద్ర మిదిగొ !
రాదు ప్రత్యేక హోదా , పరాయి మనము ,
చాలు ' ప్యాకేజి ' మన్ను , యెంచక్క మనకు
సర్దుకొనిపోవు నలవాటు చాల గలదు .
అమర పురాధిపు లందరు
సమరము శాయంగలేక శాంతియు , క్షమయున్
సమపాళ్ళ గలిపి త్రాగుచు
బ్రమ లందున ముంచి ప్రజల , బ్రతుకుదు రెలమిన్ .
19, అక్టోబర్ 2017, గురువారం
18, అక్టోబర్ 2017, బుధవారం
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .....
గరుడుపై నిడుచక్కి గగనాని కెగబ్రాకి
కోపానల జ్వాల కోల జేసి
వింటి నారికి జేర్చి మంటికి మింటికి
కణ కణ విస్ఫులింగాలు రాల
నాధుండు డస్సి విణ్ణాణంబు వీక్షించ
గరుడుండు గువ్వయి కానుపింప
జడిసి సురాసుర లుడిగి భువి బడంగ
బ్రహ్మ మేల్కాంచి విభ్రమము దొడర
కదన రంగాన గల నరకాసురుండు
నీ కొడుకునమ్మ ! చంపొద్దని యడు గిడుచు
ఏడ్చి గీపెట్టి చేతులు మ్రోడ్చు చున్న
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .
చెడును శిక్షించు పట్టున పుడమి తల్లి
యే వివక్షను చూపలేదే ! విడువక ,
రావణుని చావు పట్టున రమణి సీత
తల్లి పుడమిని తలపించె తాను కూడ .
9, అక్టోబర్ 2017, సోమవారం
మా కుల్లూరు - చదువుల సిరి
చదువులమ్మ మమ్ము చల్లగా దీవించె
సిరుల కొమ్మ మాకు చేరువయ్యె
సిరియు చదువులమ్మ జీవించి రీ యూరి
బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి .
కోట బలిజ లైరి కొలువులు వెలయించి
రాజసమ్ము నాడు రాజ్యమేలె
పేట బలిజ లైరి పేరైన వాణిజ్య
సరణి పూని మథ్య తరములందు .
ఒజ్జబంతులైరి ఊరు ఊరంతయు
గురువు లనగ నాడు గౌరవమ్ము
ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు
పెద్ద చదువు లందు పేర్మి కలిమి .
తల్లి దయలు గలుగ కుల్లూరు బలిజలు
భాగ్యవంతు లెల్ల యోగ్యతలకు
చదువులందు సకల సంపద లందున
సాటి రారు మాకు సకల జనులు .
ఏ పట్టణ మే నగరము
యేపట్టున జూడ మేమె యేర్పడ ఘనమై
చూపట్టుదు మంతట మా
దీపపు వెలు గంతవట్టు దీపింపంగా .
సిరుల కొమ్మ మాకు చేరువయ్యె
సిరియు చదువులమ్మ జీవించి రీ యూరి
బలిజ లిండ్ల వెలసి కొలువుదీరి .
కోట బలిజ లైరి కొలువులు వెలయించి
రాజసమ్ము నాడు రాజ్యమేలె
పేట బలిజ లైరి పేరైన వాణిజ్య
సరణి పూని మథ్య తరములందు .
ఒజ్జబంతులైరి ఊరు ఊరంతయు
గురువు లనగ నాడు గౌరవమ్ము
ఇంజనీర్లు , వెజ్జు లిప్పటి తరమందు
పెద్ద చదువు లందు పేర్మి కలిమి .
తల్లి దయలు గలుగ కుల్లూరు బలిజలు
భాగ్యవంతు లెల్ల యోగ్యతలకు
చదువులందు సకల సంపద లందున
సాటి రారు మాకు సకల జనులు .
ఏ పట్టణ మే నగరము
యేపట్టున జూడ మేమె యేర్పడ ఘనమై
చూపట్టుదు మంతట మా
దీపపు వెలు గంతవట్టు దీపింపంగా .
8, అక్టోబర్ 2017, ఆదివారం
మా కుల్లూరు - కవి పండితులు
ఎన్నో తరముల నుండియు
పన్నుగ మా పెద్దలంత పండిత కవులే ,
మున్నిట కావ్యములు వెలసి
యున్నవి కొన్నింటి దెల్పు దుదహృత మొనరన్
తోట నరసింహ దాసు చేతో ముదముగ
' రామ రామ ' శతకము నేర్పడగ జెప్పె
పిండ మాది జన్మాంతమై వెలయు కథన
మద్భుతమ్ముగ వెలయించె నందు బుధుడు
దరిమడుగు వంశ ధీనిధు
లిరువురు కవి సోదరులు రచించిరి కావ్యాల్
అరయన్ మల్లయ , కామయ
లరుదగు పండితులు బలిజ లందు ప్రముఖులున్
ప్రౌఢ కావ్యమ్ము ' భారవి ' , ' రాయ ' లనెడు
నాటకమ్మును కామయ్య , ఆటవెలది
జెలగు ' రామాయణమ్ము 'ను వెలయ జేసె
మల్లయ మనోహరముగ రామార్పణముగ
త్రవ్వి తీయంగ నింకనూ నివ్వటిల్లు
నిచటి బలిజ బుధ వరుల రచన లెన్నొ
అందు బుట్టిన నేనునూ అంది పుచ్చు
కొంటి కొంతగా నైన నా కోర్కె దీర .
పన్నుగ మా పెద్దలంత పండిత కవులే ,
మున్నిట కావ్యములు వెలసి
యున్నవి కొన్నింటి దెల్పు దుదహృత మొనరన్
తోట నరసింహ దాసు చేతో ముదముగ
' రామ రామ ' శతకము నేర్పడగ జెప్పె
పిండ మాది జన్మాంతమై వెలయు కథన
మద్భుతమ్ముగ వెలయించె నందు బుధుడు
దరిమడుగు వంశ ధీనిధు
లిరువురు కవి సోదరులు రచించిరి కావ్యాల్
అరయన్ మల్లయ , కామయ
లరుదగు పండితులు బలిజ లందు ప్రముఖులున్
ప్రౌఢ కావ్యమ్ము ' భారవి ' , ' రాయ ' లనెడు
నాటకమ్మును కామయ్య , ఆటవెలది
జెలగు ' రామాయణమ్ము 'ను వెలయ జేసె
మల్లయ మనోహరముగ రామార్పణముగ
త్రవ్వి తీయంగ నింకనూ నివ్వటిల్లు
నిచటి బలిజ బుధ వరుల రచన లెన్నొ
అందు బుట్టిన నేనునూ అంది పుచ్చు
కొంటి కొంతగా నైన నా కోర్కె దీర .
5, అక్టోబర్ 2017, గురువారం
అందరూ చదవ తగ్గ ' ఉత్తరం ' .
రచయితెవరో తెలియదు .
ఒక మిత్రుడు fb లో ప్రచు
రించారు . రచయితకూ
సేకరించిన సదరు మి
త్రునికీ ధన్యవాదములు .
అందరూ చదువ దగ్గది .
*****************
చిరంజీవి ------- కి,
అమ్మ దీవించి వ్రాయునది.
నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను.
నా అంతవాడివి నువ్వైయ్యావు,
నీ కుటుంబం నీది.
మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా కొన్ని విషయాలు చెపుదామనుకొంటున్నాను.
నచ్చితే విను.
నచ్చకపోతే వదిలెయ్ .
పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తేవాళ్ళు అలా తయారౌతారు.
ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక విషయం గ్రహించాలి.
పిల్లలెదురుగుండా మీరు ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.
చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.
అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.
ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే
వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.
మీరు మీ ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.
పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా
లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది
తప్పకుండా నేర్పాలి.
అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!
అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.
పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!
ఈ విషయాలన్నీ పెద్ద చదువులు చదువుకొన్న మీ వంటి భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో మీ భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు నేటి మీవంటి భార్యాభర్తలు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.
ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే ,మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.
ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం.వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం,అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి.
చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.
మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం.
నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే. కోపగించుకోవని తెలుసు.
ఎదురుగానే చెప్పకపోయావా అంటావేమో? నేను ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం
చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.
అవసరమనుకొంటే కోడలికి కూడా ఈ లేఖ చూపించు. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు. లేదూ, అమ్మదంతా చాదస్తం అంటే చింపి పారెయ్ .
వుంటాను
సదా నీ క్షేమం కోరే
అమ్మ
ఒక మిత్రుడు fb లో ప్రచు
రించారు . రచయితకూ
సేకరించిన సదరు మి
త్రునికీ ధన్యవాదములు .
అందరూ చదువ దగ్గది .
*****************
చిరంజీవి ------- కి,
అమ్మ దీవించి వ్రాయునది.
నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను.
నా అంతవాడివి నువ్వైయ్యావు,
నీ కుటుంబం నీది.
మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా కొన్ని విషయాలు చెపుదామనుకొంటున్నాను.
నచ్చితే విను.
నచ్చకపోతే వదిలెయ్ .
పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తేవాళ్ళు అలా తయారౌతారు.
ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక విషయం గ్రహించాలి.
పిల్లలెదురుగుండా మీరు ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.
చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.
అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.
ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే
వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.
మీరు మీ ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.
పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా
లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది
తప్పకుండా నేర్పాలి.
అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!
అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.
పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!
ఈ విషయాలన్నీ పెద్ద చదువులు చదువుకొన్న మీ వంటి భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో మీ భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు నేటి మీవంటి భార్యాభర్తలు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.
ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే ,మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.
ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం.వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం,అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి.
చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.
మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం.
నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే. కోపగించుకోవని తెలుసు.
ఎదురుగానే చెప్పకపోయావా అంటావేమో? నేను ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం
చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.
అవసరమనుకొంటే కోడలికి కూడా ఈ లేఖ చూపించు. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు. లేదూ, అమ్మదంతా చాదస్తం అంటే చింపి పారెయ్ .
వుంటాను
సదా నీ క్షేమం కోరే
అమ్మ
30, సెప్టెంబర్ 2017, శనివారం
విజయదశిమి - నేడు - విజయోస్తు జగతికి .....
పుడమిని పోరాడి దుర్గ పున్నెపు ప్రోవై
కడుకొని మంచికి విజయము
గడియించెను మార్గ దర్శిగా నిల్చి సదా .
చెడుపై పోరాడు డటం
చడుగడుగున విజయ దశమి సందేశ మిడున్
చెడుపై పోరాడుటయే
పుడమి జనులు దుర్గ గొలిచి పూజించు టగున్ .
ఏటేటా విజయ దశమి
పాటింతుము గాని దాని పరమార్థమ్మున్
దీటుగ పాటించ గలుగు
నాట గదా ! విజయ దశమి నవ్యత దాల్చున్ .
మన దాకా వచ్చు వరకు
మనకేమీ పట్టనట్లు మనుట విడిచి , చెం
తన గల చెడునెదిరించిన
ఘనవిజయము వచ్చు మంచి ఘనమై నిలుచున్
అమ్మ చెప్పినదిది , నమ్మి తనంతగా
నెవడు పూని సత్య నిష్ట గలిగి
చెడును పట్టుపట్టి చీల్చి చెండాడునో
వాని కండ నిలుచు వచ్చి దుర్గ .
28, సెప్టెంబర్ 2017, గురువారం
తల్లీ ! దుర్గమ్మా ! వందనాలు .
దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .
తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .
అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .
తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .
అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .
27, సెప్టెంబర్ 2017, బుధవారం
మాతా సరస్వతీ .....
నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి !
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా మాత ! వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,
జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .
పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి !
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మమ్ము గావు మమ్మ ! మంజు వాణి .
విన్నపాలు వినవలె ....
పలు భాషల పరిచయములు
పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్
పలు దేశ విశేషానుభ
వ లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్
అందరము పెద్దవయసులో కడుగిడితిమి
ఆట విడుపుగ నిట నొక చోట చేరి
కదిసి మచ్చటించు తరిని కాస్తటు నిటు
మాట లొలుకుట సహజమ్ము మాన్యచరిత !
వారం రోజులు మీమీ
తీరులు తెన్నులు దెలియక తికమక పడి యే
తీరున నుండిరొ యని హితు
లారయ వెదుకాడిరి హితురాలని కాదా ?
పెద్దవారు శర్మ పేరిమి విడువరు
కూరిమి మనసార కోరుచుంద్రు
క్లేశ మొంది కూడ క్షీరధవళశోభ
తరుగదు మనసున గురు విభవులు .
హాస్య భాషణమ్ము లపహాస్య మవనీక
కట్టడించు కొనగ కష్ట మేమి ?
చతుర భాషణమున చాతుర్య మబ్బిన
తమకు సాధ్య మవని దారి గలదె !
పల్లాయి బల్కు 'సుగుణము'
పల్లికిలించుటలకంటె 'పరమ ఘనం'బౌ
నెల్లెడల పనికిరా దది
తల్లీ!విడువంగ నగును తమరికనైన్ .
పలు గ్రంథాంతర పరిచయ ప్రావీణ్యములున్
పలు దేశ విశేషానుభ
వ లసద్బుధులుగ 'జిలేబి'వారిని దలతున్
అందరము పెద్దవయసులో కడుగిడితిమి
ఆట విడుపుగ నిట నొక చోట చేరి
కదిసి మచ్చటించు తరిని కాస్తటు నిటు
మాట లొలుకుట సహజమ్ము మాన్యచరిత !
వారం రోజులు మీమీ
తీరులు తెన్నులు దెలియక తికమక పడి యే
తీరున నుండిరొ యని హితు
లారయ వెదుకాడిరి హితురాలని కాదా ?
పెద్దవారు శర్మ పేరిమి విడువరు
కూరిమి మనసార కోరుచుంద్రు
క్లేశ మొంది కూడ క్షీరధవళశోభ
తరుగదు మనసున గురు విభవులు .
హాస్య భాషణమ్ము లపహాస్య మవనీక
కట్టడించు కొనగ కష్ట మేమి ?
చతుర భాషణమున చాతుర్య మబ్బిన
తమకు సాధ్య మవని దారి గలదె !
పల్లాయి బల్కు 'సుగుణము'
పల్లికిలించుటలకంటె 'పరమ ఘనం'బౌ
నెల్లెడల పనికిరా దది
తల్లీ!విడువంగ నగును తమరికనైన్ .
26, సెప్టెంబర్ 2017, మంగళవారం
అన్నవరం సత్యదేవుని సందర్శనం.
రత్నగిరీశ్వరున్ గొలువ రమ్మని బిల్చిన బిడ్డవెంట నే
న్నూత్న మనో విభూతి వలనొప్పగ వెళ్ళితి , నెంత వేడుకో !
యత్నము సాంతమున్ మదికి హాయి నొసంగెను , జన్మ పుణ్యముల్
నూత్నములై యదృష్టముల నొక్కెడ గూర్చిన భాగ్య మొప్పగా -
కను విందుగా క్రింది గర్భాలయమ్ములో
శ్రీచక్రయుతముగా చెలువు మెరయ
బ్రహ్మాది దేవతల్ పడి పడి మ్రొక్కిన
పాదాలు గంటిని పరవశమున
కడు శోభనము పైన గర్భాలయమ్ములో
శివ , రమా మూర్తులు చేరి కొలువ
మధ్యలో కొలువైన మహనీయ మూర్తి ము
ఖమును గంటిని నాదు కర్మ తొలగె
అన్నవరము యాత్ర మిన్నయై మదిదోచె
కన్నుల కొక పుణ్య మున్న కతన
జన్మ ధన్య మయ్యె , సత్యదేవు మహా ప్ర
సాదము దొరికినది , సకల శుభము .
సత్య దేవు నెదుట సాగిలి మ్రొక్కితి
వ్రతము సేయు భక్త వరుల గంటి
వెలయు కొండ మీది యిలను వైకుంఠమ్ము
కన్నులార గంటి కరవు దీరె .
24, సెప్టెంబర్ 2017, ఆదివారం
పురుహూతికా దేవి దర్శన భాగ్యం లభించింది .
పిఠాపురం వెళ్ళేను ,
పురుహూతికా సతీదేవిని దర్శించుకున్నాను .
తన్మయత్వం చెందేను .
---------------------------
21, సెప్టెంబర్ 2017, గురువారం
ముగురమ్మల మూలపుటమ్మకు వందనం
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు
ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు
ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .
15, సెప్టెంబర్ 2017, శుక్రవారం
కనియెన్ రుక్మిణి .....
కనియెన్ రుక్మిణి ' చంద్ర మండల ముఖున్ , కంఠీరవేంద్రావల
గ్ను , నవాంభోజ దళాక్షు , చారుతర వక్షున్ , మేఘ సంకాశ దే
హు , నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్ , చక్రి , పీతాంబరున్ ,
ఘన భూషాంకితు , కంబు కంఠు , విజయోత్సాహున్ , జగన్మోహనున్ ' .
------ బమ్మెర పోతన
భారతావని చల్లగా బ్రతుకు గాత !
హస్త సాముద్రికం బందించి భవితను
నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు
అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత
గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
భారతావని చల్లగా బ్రతుకు గాత !
నేడె కళ్ళకు గట్టు నేర్చి యొకడు
జ్యోతిష్యము మనుష్యజాతికి తగిలించి
గతుల నాపాదించు ఘను డొకండు
పేరును సంఖ్యగా పేర్చి యిట్టటు మార్చి
నెంబరు గేమాడు నేర్పరొకడు
తాయెత్తు గట్టి మంత్రాలు మాయ లొనర్చ
నేమమ్ము గల మహనీయు డొకడు
అంద రున్నత కులజులే , అందులోను
శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత
గొప్పగా వాడుచున్నారు , గొప్ప వారె !
భారతావని చల్లగా బ్రతుకు గాత !
24, ఆగస్టు 2017, గురువారం
ఓం జయ గణేశాయ నమః
కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి
మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు సకల సంపద ప్రదాత
శ్రీ గణేశుని తొలిపూజ చేసి కొలుతు .
14, ఆగస్టు 2017, సోమవారం
మాయ జేసెద వేమిరా ! మమ్ము కృష్ణ !
ఆడేవు దొంగాట ఆయశోదా దేవి
కొంగు మాటున జేరి రంగు మార్చి
కూడేవు సయ్యాట కోరిన రాధతో
పయ్యెద కొంగు నింపార విడక
పాడేవు మురళి రూపానల జ్వాల ర
గిల్చి జగముల నూగించి బ్రమల
మాడేవు గో గోప చూడా మణులతోడ
మామూలు బాలుడై మసలు కొనుచు
బుధ్ధి మంతుని పగిది రూపున యదేమి
యల్లరిర ? యయ్యొ ! గోపికల్ తల్లడిలిరి ,
జగతి నంతను మోహ విచలిత జేసి
మాయ జేయుదు వేమిరా ! మమ్ము కృష్ణ !
8, జులై 2017, శనివారం
గురు పౌర్ణమి .....
' వందే కృష్ణ జగద్గురుమ్ ' విమల విశ్వజ్ఞాన గీతార్యుకున్
వందే వ్యాసునికిన్ మహద్గురునికిన్ వందే చతుర్వేదకున్
వందే సాయికి సద్గురూత్తమునికిన్ వందే జగత్రాతకున్
వందే వెంకయ సామికిన్ మము సదా వర్దిల్లగా జూడగాన్
వందే వ్యాసునికిన్ మహద్గురునికిన్ వందే చతుర్వేదకున్
వందే సాయికి సద్గురూత్తమునికిన్ వందే జగత్రాతకున్
వందే వెంకయ సామికిన్ మము సదా వర్దిల్లగా జూడగాన్
7, జులై 2017, శుక్రవారం
చొక్కిన యొకజంట .....
తెలుగు పద్యం
-----------------
చొక్కిన యొకజంట చూచుకుంటున్నట్లు
పలుమార్లు చదివించు భ్రాంతి ముంచి
ప్రియమార నొకజంట పిలుచుకుంటున్నట్లు
చెవులలో నింపైన చవులు నింప
శ్రుతి మించి యొకజంట చుంబించు కొన్నట్లు
పెదవుల మాటల మధువు లద్ద
కసిదీర నొకజంట కౌగిలించుచు పొందు
నానంద రస మగ్న మనుభ వింప
ముద్దు మాటలు దొర్లించి ముదము గూర్చ
సొగసు టూహల భావ మంజూష నింపి
తియ్య మామిళ్ళు తేనెలో దిగిచి నట్లు
తెలుగు పద్యపు సౌరు వర్థిల్ల వలయు .
-----------------
చొక్కిన యొకజంట చూచుకుంటున్నట్లు
పలుమార్లు చదివించు భ్రాంతి ముంచి
ప్రియమార నొకజంట పిలుచుకుంటున్నట్లు
చెవులలో నింపైన చవులు నింప
శ్రుతి మించి యొకజంట చుంబించు కొన్నట్లు
పెదవుల మాటల మధువు లద్ద
కసిదీర నొకజంట కౌగిలించుచు పొందు
నానంద రస మగ్న మనుభ వింప
ముద్దు మాటలు దొర్లించి ముదము గూర్చ
సొగసు టూహల భావ మంజూష నింపి
తియ్య మామిళ్ళు తేనెలో దిగిచి నట్లు
తెలుగు పద్యపు సౌరు వర్థిల్ల వలయు .
6, జులై 2017, గురువారం
ఊహింపంబడె .....
ఊహింపంబడె నల్లనయ్య నలుపొక్కొక్కర్కియొక్కోటిగా
సాహిత్యానలతప్తులై యొకరు తా సారించి నల్పే తనన్
తా హీనంబుగనెంచి శ్యామలుని యొద్దంజేరెనం , చొక్క రా
శ్రీ హర్షుండు విముక్త కీర్తి సితుడై శ్రీ దేహుడైనట్లుగాన్ .
మరియు నొకరు విశ్వంబు మాడ్కి విశ్వ
విభుడును నలుపనె , జలద విభవ మొంది
శ్యామలుండయ్యె ననె నొక్క రా మదన జ
నకుని నైన సంశయము మానదు మనంబు .
వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
సాహిత్యానలతప్తులై యొకరు తా సారించి నల్పే తనన్
తా హీనంబుగనెంచి శ్యామలుని యొద్దంజేరెనం , చొక్క రా
శ్రీ హర్షుండు విముక్త కీర్తి సితుడై శ్రీ దేహుడైనట్లుగాన్ .
మరియు నొకరు విశ్వంబు మాడ్కి విశ్వ
విభుడును నలుపనె , జలద విభవ మొంది
శ్యామలుండయ్యె ననె నొక్క రా మదన జ
నకుని నైన సంశయము మానదు మనంబు .
వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
నల్లనివాడైన నమ్మినారు .....
జయ కృపారసము పైజల్లంగనే నీవు
నల్లనివాడైన నమ్మినారు
పద్మ నయనములు బరుపంగనే నీవు
నల్లనివాడైన నమ్మినారు
తలకట్టు పింఛంపు వలలు వేయంగనే
నల్లనివాడైన నమ్మినారు
నవ్వురాజిల్లు మో మివ్వటిల్లెడు నీవు
నల్లనివాడైన నమ్మినారు
నమ్మి చెల్వలు మానధనంబు లివ్వ
దోచుకొనిపోయి యెక్కడో దూరినావు
మల్లియల నడిగెద రాయమాయకులు , క
నియు కనుపడ వేమిర ! కమనీయ రూప !
4, జులై 2017, మంగళవారం
నీ కెలా గంటు కొనె నల్పు నీరజాక్ష !
దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు
బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు
బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !
3, జులై 2017, సోమవారం
ఎవరు చెప్పిరి నలుపని .....
వలచిన భామినీ మలయజ కలయ సం
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
బంధియై తనుచాయ కందె గాని
మరకత మణిమయ మధుపర్కములు గట్టి
డాలున తనుచాయ డస్సె గాని
తల్లి యశోదమ్మ తనర నగరు ధూప
మేసిట్లు తనుచాయ మిర్రె గాని
గొల్ల పిల్లల తోడి కోడిగంబున యాడి
కూడంగ తనుచాయ కుదిసె గాని
యెవరు చెప్పిరి నలుపని యేను నమ్మ
నా జగన్మోహనాకారు డా మనోహ
రుండు జగము పరవశించు రూపసి యగు
కృష్ణుని తనుచాయ శోభన కృత సితమ్ము .
15, జూన్ 2017, గురువారం
మనోఙ్ఞమైన పద్యం
మనోఙ్ఞమైన సీసపద్యము
-------------------------------
అవగాహనేహా సమాయత్త విభుదరా
ట్కమనీయ మణి శతాంగములనంగ
తాటాక సేతు సందర్శనేచ్ఛా గత
స్థిత సమున్నత మహా శిఖరులనగ
నేతదుజ్వల ధరానేతృ సంపాదిత
మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ
ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి
వరుణ రాజన్య గోపురములనగ
నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా కంబములు జెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .
పై పద్యం భావం
-----------------
మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన
చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు
ముప్పదిమూడు రాతిస్థంభాలతో అలుగు నిర్మిం
చెను . ఆ అలుగు వర్ణణ యిది .
క్రీ.శ. 1612లో
శిలాశాసనంలో వ్రాయబడి ఉంది .
సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల
రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ
రథము వలెనూ , తటాక సేతు సందర్శనేచ్చతో
వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ ,
ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన
రాజులు సముపార్జించిన కీర్తి స్థంభాల వలెనూ ,
ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము
నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు
రముల వలెనూ అలుగు రాతిస్థంభములున్నవట .
ఈ శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534
పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా క్రీ.శ.1612 న ఇది వ్రాయ
బడింది .
అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య
మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా
ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు
వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార ధురందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట .
ఇదీ సంగతి .
ఈ శాసనంలో ఇంకో విశేషముంది .
శాలివాహన శకం 1534 అని వ్రాయడానకి
బదులుగా ---
' శాలివాహన శకే వార్ధిత్రిబాణేధరా సంఖ్యాకే '
అని వ్రాసి ఉంది . అనగా ----
వార్ధి = సముద్రాలు = 4
త్రి = 3
బాణ = 5
ధరా = 1
అంకానాం వామతో గతిః కాబట్టి
శాలివాహనశకం = 1534 అనుకోవాలి .
సంస్కృత శ్లోకం తర్వాత శాసనంలో
తెలుగు ప్రారంభించారు .
అక్కడ శాలివాహన శక వరుషంబులు 1534
అని తెలుగంకెలలో వ్రాయబడి ఉంది .
శ్రీ పంతుల గోపాల కృష్ణారావు గారు
ఒక టపాలో వివరించినట్లు
సున్న , అరసున్నలు తెలుపుటకు ---
సున్నతరువాత ద్విత్వం చేసి వ్రాసియున్నారు .
అలాంటి వాటిని నిండుసున్నగానూ ---
సున్న తరువాత ద్విత్వం వ్రాయని చోట్ల
అరసున్నగానూ చదువితే శాసనం సులభం
గా అర్థమయ్యింది . అనవసరమైన చోట్ల సున్నలెందుకు వ్రాస్తున్నారో , అవసరమైన చోట్ల సున్న తదుపరి ద్విత్వమెందుకు చేస్తున్నారో అర్థంగాక సతమత మయ్యేది . కాని , పంతులు గారి టపా సంశయాన్ని తొగించింది . వారికి కృతఙ్ఞతలు . ఇక రేఫను తదుపరి అక్షరానికి
ఆవల గిలకగా వ్రాయడం సరేసరి .
-------------------------------
అవగాహనేహా సమాయత్త విభుదరా
ట్కమనీయ మణి శతాంగములనంగ
తాటాక సేతు సందర్శనేచ్ఛా గత
స్థిత సమున్నత మహా శిఖరులనగ
నేతదుజ్వల ధరానేతృ సంపాదిత
మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ
ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి
వరుణ రాజన్య గోపురములనగ
నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా కంబములు జెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .
పై పద్యం భావం
-----------------
మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన
చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు
ముప్పదిమూడు రాతిస్థంభాలతో అలుగు నిర్మిం
చెను . ఆ అలుగు వర్ణణ యిది .
క్రీ.శ. 1612లో
శిలాశాసనంలో వ్రాయబడి ఉంది .
సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల
రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ
రథము వలెనూ , తటాక సేతు సందర్శనేచ్చతో
వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ ,
ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన
రాజులు సముపార్జించిన కీర్తి స్థంభాల వలెనూ ,
ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము
నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు
రముల వలెనూ అలుగు రాతిస్థంభములున్నవట .
ఈ శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534
పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా క్రీ.శ.1612 న ఇది వ్రాయ
బడింది .
అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య
మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా
ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు
వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార ధురందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట .
ఇదీ సంగతి .
ఈ శాసనంలో ఇంకో విశేషముంది .
శాలివాహన శకం 1534 అని వ్రాయడానకి
బదులుగా ---
' శాలివాహన శకే వార్ధిత్రిబాణేధరా సంఖ్యాకే '
అని వ్రాసి ఉంది . అనగా ----
వార్ధి = సముద్రాలు = 4
త్రి = 3
బాణ = 5
ధరా = 1
అంకానాం వామతో గతిః కాబట్టి
శాలివాహనశకం = 1534 అనుకోవాలి .
సంస్కృత శ్లోకం తర్వాత శాసనంలో
తెలుగు ప్రారంభించారు .
అక్కడ శాలివాహన శక వరుషంబులు 1534
అని తెలుగంకెలలో వ్రాయబడి ఉంది .
శ్రీ పంతుల గోపాల కృష్ణారావు గారు
ఒక టపాలో వివరించినట్లు
సున్న , అరసున్నలు తెలుపుటకు ---
సున్నతరువాత ద్విత్వం చేసి వ్రాసియున్నారు .
అలాంటి వాటిని నిండుసున్నగానూ ---
సున్న తరువాత ద్విత్వం వ్రాయని చోట్ల
అరసున్నగానూ చదువితే శాసనం సులభం
గా అర్థమయ్యింది . అనవసరమైన చోట్ల సున్నలెందుకు వ్రాస్తున్నారో , అవసరమైన చోట్ల సున్న తదుపరి ద్విత్వమెందుకు చేస్తున్నారో అర్థంగాక సతమత మయ్యేది . కాని , పంతులు గారి టపా సంశయాన్ని తొగించింది . వారికి కృతఙ్ఞతలు . ఇక రేఫను తదుపరి అక్షరానికి
ఆవల గిలకగా వ్రాయడం సరేసరి .
31, మే 2017, బుధవారం
మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం
మా కుల్లూరు -- ప్రాచీన శివాలయం
------------------------------------------
మా కుల్లూరు గ్రామం చెరువు కట్ట క్రింద ,
అలుగుకూ - కోట శిథిలాలకూ మథ్య
ప్రాచీన శివాలయం శిథిలావస్థలో ఉండేది .
మా బాల్యంలో సదరు శిథిలాలలో ఆడుకునే
వాళ్ళం . శివాలయానికి ఉపయోగించిన గోధుమ
వర్ణపు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఊడి చెల్లా
చెదురుగా పడి ఉండేవి . నల్లరాతితో చెక్కబడి
నిగనిగలాడుతూ పెద్ద నంది విగ్రహం కూడా
ఉండేది . దానిని ముక్కలు చేసి దొంగలు
తరలించారని వినికిడి .
మా కుల్లూరు గ్రామస్థుడు , ప్రస్తుతం బెంగ
ళూరు నివాసి , పరమ ధార్మికుడు శ్రీ యాదాల
కృష్ణయ్య గారు పూనుకొని సదరు శివాలయాన్ని
సర్వాంగ సుందరంగా పునర్నిర్మిస్తున్నారు . తెల్లటి
గ్రానైట్ రాళ్ళు తెప్పించి , ఆలయ నిర్మాణం చేపట్టి
నారు . ఆలయానికి ముందు రాతి స్తంభాలతో సు
విశాలమైన మండప నిర్మాణం చేశారు . పూర్వం
వందల యేళ్ళనాటి మహారాజుల నిర్మాణ శైలిని
బోలి ఆలయం కను విందు చేస్తూ ఉంది .
మూడెకరాల సువిశాల ఆలయ ప్రాంగణ
మంతా వివిథ పూల మొక్కలతో , వృక్షాలతో
ఆలయం నయన మనోహరంగా రూపు దిద్దుకుం
టోంది . ఈ శివాలయం పేరు గంగాధరేశ్వరాల
యం . కృష్ణయ్య గారి జీవితం ధన్యం .
జీర్ణోధ్ధరణ సమయంలో ఈప్రదేశంలో
ఒక శిలాశాసనం బయల్పడి ఆలయంలో ప్రతి
ష్టింప బడింది . దీనిపైన శాసనం తమిళ లిపిలో
చెక్కబడి ఉంది . దీనిని తెలుగులోకి తర్జుమా
చేస్తే ఆలయానికి , గ్రామానికీ సంబంధించిన
సమాచారం తెలియగలదు . పాఠకులు ప్రయ
త్నించ గలరు .
శాసనం
-----------
మా కుల్లూరు -- శాసనాధారాలు
మా కుల్లూరు - శాసనాధారాలు
-------------------------------------
ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ
ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది .
ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ
బడి ఉంది . 1574 అనుకుంటాను .
ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ
బడినది .
సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , అతడు ముప్పది మూడు శిలాస్థంభములతో అలుగు నిర్మించడం ఈ శిలాశాసనంలోని అంశం .
ప్రసక్తాను ప్రసక్తంగా సదరు రుద్రప్ప అనంతసాగరం
చెరువు తూమును , కలువాయి చెరువు తూర్పు
అలుగును అంతకు ముందే నిర్మించి యున్నట్లు
ఈ శాసనంలో ఉట్టంకించ బడింది .
ఈ శాసనస్థ తెలుగు భాష కొద్దిపాటి తేడాలతో
ఇప్పటి తెలుగు భాషకు , లిపికి దగ్గరగా ఉంది .
ఇందులో చివర్న రుద్రప్పను పొగుడుతూ
ఒక సీస పద్యం కూడా ఉన్నట్లు నాకనిపించింది .
అక్షరాలు మసక బారడం వల్ల చాలవరకు స్పష్టత
కోల్పోయినవి . తేటగీతి పద్యం మాత్రం కాస్త
విస్పష్టంగా ఉంది .
తేటగీతి పద్యం
------------------
నిలిపె కుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా... లుంజెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్ర శౌరి .
శాసనం
---------
-------------------------------------
ఈ క్రింది శాసనం వెంకట పతి రాయలు ఈ
ప్రాంతాన రాజ్యం చేస్తున్నప్పటి కాలానిది .
ఇందులో శాలివాహన శక సంవత్సరం వ్రాయ
బడి ఉంది . 1574 అనుకుంటాను .
ఇది కుల్లూరు చెరువు అలుగు వద్ద ప్రతిష్టించ
బడినది .
సదరు రాజు చింతపట్ల రుద్రప్ప అనే చెరువుల నిర్మాణ నిపుణుని పిలిపించి కుల్లూరు నల్ల చెరువుకుఅలుగునిర్మించవలసినదిగాసబహుమానముగాఆనతివ్వడం , అతడు ముప్పది మూడు శిలాస్థంభములతో అలుగు నిర్మించడం ఈ శిలాశాసనంలోని అంశం .
ప్రసక్తాను ప్రసక్తంగా సదరు రుద్రప్ప అనంతసాగరం
చెరువు తూమును , కలువాయి చెరువు తూర్పు
అలుగును అంతకు ముందే నిర్మించి యున్నట్లు
ఈ శాసనంలో ఉట్టంకించ బడింది .
ఈ శాసనస్థ తెలుగు భాష కొద్దిపాటి తేడాలతో
ఇప్పటి తెలుగు భాషకు , లిపికి దగ్గరగా ఉంది .
ఇందులో చివర్న రుద్రప్పను పొగుడుతూ
ఒక సీస పద్యం కూడా ఉన్నట్లు నాకనిపించింది .
అక్షరాలు మసక బారడం వల్ల చాలవరకు స్పష్టత
కోల్పోయినవి . తేటగీతి పద్యం మాత్రం కాస్త
విస్పష్టంగా ఉంది .
తేటగీతి పద్యం
------------------
నిలిపె కుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా... లుంజెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్ర శౌరి .
శాసనం
---------
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






















