గీత రచయిత :వెంకట రాజారావు లక్కాకుల
రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా
ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్కసీతయెసతిగ యుగపురుషుడైనిలిచె
దండ్రి కిచ్చిన మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడియునూ విడువని
రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా
అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలుపొంది యీమనుజులందరకు రావణుని చావుతో రామబాణము శక్తి రామనామము శక్తి రాజిల్లె లోకాన
రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా
తొలుత శ్రీరామయని పలుకులో రాతలో
పలుకక రాయక వెలయింప రేదియు
పల్లెలా పట్నాల ప్రతి మందిరాలలో
కడగి సీతారామ కళ్యాణములు సేయ
రాముడే రాజుగా రక్షగా ప్రజలకు
త్రిజగాలు కొలిచేను త్రేతాయుగాదిగా
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి