గీత రచయిత : వెంకట రాజారావు లక్కాకుల
వెంకయ్య స్వామి
----------------------
ఏ యుగమున గాని ఇంత స్వచ్చతముని
విని యెరుగము తండ్రీ వెంకయ్య స్వామీ
వశ్యవాక్కు లనుచు వచియింతురే గాని
నిన్ను గన్నంతనే నిజమనుచు తెలిసెను
ఏ యుగమున గాని ఇంత స్వచ్చతముని
విని యెరుగము తండ్రీ వెంకయ్య స్వామీ
పసుల మనుషుల రోగ బాధలను తప్పింప
నిన్నంపె పరమాత్మ నీల మోహన రూప
ఏ యుగమున గాని ఇంత స్వచ్చతముని
విని యెరుగము తండ్రీ వెంకయ్య స్వామీ
జలయఙ్ఞములు జేసి జనములకు మాతండ్రీ
వ్రేలిముద్రలను వేసి విల్లు వ్రాస్తివి స్వామీ
ఏ యుగమున గాని ఇంత స్వచ్చతముని
విని యెరుగము తండ్రీ వెంకయ్య స్వామీ
గొలగమూడి నివాస గోవింద పరమాత్మ
ఆది నారాయణ రూప ఆదుకో వెంకయ్య
ఏ యుగమున గాని ఇంత స్వచ్చతముని
విని యెరుగము తండ్రీ వెంకయ్య స్వామీ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి